నెక్స్ట్ జెన్ స్కూలును   సైనిక్ స్కూలు సొసైటీలో చేర్చాలి

కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్ నాధ్ సింగ్ ను కలిసి వినతిపత్రం అందిస్తున్న ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి
కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాధ్ సింగ్ ను కోరిన ఒంగోలు  ఎంపీ మాగుంట
ఒంగోలులోని నెక్స్ట్ జెన్ ఇంటర్నేషనల్ స్కూలును ఢిల్లీలోని సైనిక్ స్కూలు సొసైటీతో అనుసంధానించాలని ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి కోరారు. ఈ మేరకు ఢిల్లీలో శుక్రవారం కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్ నాధ్ సింగ్ ణు కలిసి వినతిపత్రం అందించారు.  తమ నెక్స్ట్ జెన్ఇంటర్నేషనల్ స్కూలును సైనిక్ స్కూలు సొసైటీలో అనుసంధానం చేయడానికి కావలసిన అన్ని సదుపాయాలు ఉన్నాయని స్కూల్ చైర్మన్ డాక్టర్ కె.మురళీధర్ రెడ్డి చేసిన విజ్ఞప్తి మేరకు రాజ్ నాధ్ సింగ్ ను కలిసి మాగుంట వివరాలు అందించారు.  రక్షణ శాఖ ఆద్వర్యంలోని సైనిక్ స్కూలు సొసైటీలో ప్రభుత్వ  ప్రైవేటు భాగస్వామ్యం క్రింద  (PPP) స్కూలును 2026-27 సంవత్సరానికి సైనిక్ స్కూలు సొసైటీలో అనుసంధానం చేయాలని కోరారు. దీనిపై రాజ్ నాధ్ సింగ్ సానుకూలంగా స్పందించి పరిశీలిస్తానని హామీ ఇచ్చినట్టు వెల్లడించారు.
  • Related Posts

    ప్రకాశం జిల్లా కలెక్టర్ గా రాజాబాబు

    ప్రకాశం జిల్లా కలెక్టర్ గా రాజాబాబు నియమితులయ్యారు. బాపట్ల కలెక్టర్ గా పనిచేస్తున్న ఆయనను ప్రకాశంకు బదిలీ చేశారు.  ప్రకాశం కలెక్టర్ గా పనిచేస్తున్న తమీమ్ అన్సారియాను గుంటూరు జిల్లాకు బదిలీ చేశారు. వీరితో పాటు మొత్తం 12 మంది జిల్లా…

    గ్రామీణ విలేకరులకు పునశ్చరణ తరగతులు.

    రేపటి  నుంచి రెండు రోజులు పాటు మార్కాపురంలో శిక్షణ విజయవాడ, ఆగష్టు 29 : ప్రకాశం జిల్లా గ్రామీణ విలేకరులకు ఈనెల 30, 31న రెండు రోజుల పాటు మార్కాపురంలో పునశ్చరణ తరగతులు నిర్వహించనున్నట్టు సి. ఆర్. మీడియా అకాడమి చైర్మన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    ప్రకాశం జిల్లా కలెక్టర్ గా రాజాబాబు

    తురకపాలెంలో వరుస మరణాలపై లోతుగా పరిశోధన

    తురకపాలెంలో వరుస మరణాలపై లోతుగా పరిశోధన

    బీసీ సంక్షేమ శాఖకు స్కోచ్ అవార్డు

    ఈజ్ ఆఫ్ జస్టిస్ వ్యవస్థతోనే సత్వర న్యాయం

    ఈజ్ ఆఫ్ జస్టిస్ వ్యవస్థతోనే సత్వర న్యాయం

    గ్రామీణ విలేకరులకు పునశ్చరణ తరగతులు.

    బార్ ల లైసెన్స్ రుసుములో భారీ తగ్గింపు…

    బార్ ల లైసెన్స్ రుసుములో భారీ తగ్గింపు…