విద్యార్ధులకు మంత్రి గొట్టిపాటి సైకిళ్ళ పంపిణీ

అద్దంకి నియోజకవర్గంలో దూరభారంతో పేద బాల, బాలికలు చదువు మానివేయకుండా ఉండాలన్న సదుద్దేశంతో దశలవారీగా 10 వేల సైకిళ్లు ఉచితంగా అందిస్తానని ఇచ్చిన హామీని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ నిలబెట్టుకున్నారు. ఈ మేరకు శుక్రవారం SEIL ఎనర్జీ ఇండియా లిమిటెడ్ వారి సహకారంతో సంతమాగులూరు మండలం, కొమ్మాలపాడు గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో 104 మంది విద్యార్థులకు,  మక్కెనవారిపాలెం గ్రామంలోని జెడ్పీ హైస్కూల్ లో 349 మంది  విద్యార్థులకు ఉచితంగా సైకిళ్లు పంపిణీ చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో కష్టపడి చదువకుంటున్న విద్యార్ధినీ, విద్యార్ధులకు సైకిళ్ళు పంపిణీ చేయటం తనకెంతో సంతోషం కలిగిస్తుందని ఈ సందర్భంగా గొట్టిపాటి రవికుమార్ అన్నారు. విద్యతోనే వికాసం సాధ్యమవుతుందన్న డా.బి.ఆర్. అంబేద్కర్, మహాత్మా జ్యోతిరావ్ పూలే  బాటలో బాల, బాలికల బంగారు భవిష్యత్తుకు తన వంతుగా పూర్తి సహాయ, సహకారాలు అందిస్తానని గొట్టిపాటి హామీ ఇచ్చారు.

సైకిళ్ళ పంపిణీ సందర్భంగా విద్యార్ధులతో సంతోషం పంచుకుంటున్న మంత్రి గొట్టిపాటి రవికుమార్

 

  • Related Posts

    ప్రకాశం జిల్లా కలెక్టర్ గా రాజాబాబు

    ప్రకాశం జిల్లా కలెక్టర్ గా రాజాబాబు నియమితులయ్యారు. బాపట్ల కలెక్టర్ గా పనిచేస్తున్న ఆయనను ప్రకాశంకు బదిలీ చేశారు.  ప్రకాశం కలెక్టర్ గా పనిచేస్తున్న తమీమ్ అన్సారియాను గుంటూరు జిల్లాకు బదిలీ చేశారు. వీరితో పాటు మొత్తం 12 మంది జిల్లా…

    గ్రామీణ విలేకరులకు పునశ్చరణ తరగతులు.

    రేపటి  నుంచి రెండు రోజులు పాటు మార్కాపురంలో శిక్షణ విజయవాడ, ఆగష్టు 29 : ప్రకాశం జిల్లా గ్రామీణ విలేకరులకు ఈనెల 30, 31న రెండు రోజుల పాటు మార్కాపురంలో పునశ్చరణ తరగతులు నిర్వహించనున్నట్టు సి. ఆర్. మీడియా అకాడమి చైర్మన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    ప్రకాశం జిల్లా కలెక్టర్ గా రాజాబాబు

    తురకపాలెంలో వరుస మరణాలపై లోతుగా పరిశోధన

    తురకపాలెంలో వరుస మరణాలపై లోతుగా పరిశోధన

    బీసీ సంక్షేమ శాఖకు స్కోచ్ అవార్డు

    ఈజ్ ఆఫ్ జస్టిస్ వ్యవస్థతోనే సత్వర న్యాయం

    ఈజ్ ఆఫ్ జస్టిస్ వ్యవస్థతోనే సత్వర న్యాయం

    గ్రామీణ విలేకరులకు పునశ్చరణ తరగతులు.

    బార్ ల లైసెన్స్ రుసుములో భారీ తగ్గింపు…

    బార్ ల లైసెన్స్ రుసుములో భారీ తగ్గింపు…