గ్రామీణ విలేకరులకు పునశ్చరణ తరగతులు.

రేపటి  నుంచి రెండు రోజులు పాటు మార్కాపురంలో శిక్షణ

విజయవాడ, ఆగష్టు 29 : ప్రకాశం జిల్లా గ్రామీణ విలేకరులకు ఈనెల 30, 31న రెండు రోజుల పాటు మార్కాపురంలో పునశ్చరణ తరగతులు నిర్వహించనున్నట్టు సి. ఆర్. మీడియా అకాడమి చైర్మన్ ఆలపాటి సురేశ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. గ్రామీణ విలేకరులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. మార్కాపురంలోని సౌజన్య ఫంక్షన్ హాల్ ఈనెల 30 ఉదయం 10 గంటలకు తరగతులు ప్రారంభమవుతాయి.. సభానంతరం శిక్షణా కార్యక్రమాలు ప్రారంభమవుతాయి.. తొలి రోజున క్రైమ్ రిపోర్టింగ్, గ్రామీణ వార్తలు, కధనాలు, ఫ్యాక్ట్ చెక్ అనే అంశాలపైనా, మరుసటి రోజు ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ (AI), పత్రికా భాష, ఎలక్ట్రానిక్ మీడియా కవరేజ్ లో మెళకువలు, నెట్వర్క్ అండ్ కోఆర్డినేషన్ అనే అంశాలపై సీనియర్ జర్నలిస్టులు శిక్షణ ఇవ్వనున్నట్టు ఆలపాటి వెల్లడించారు.

  • Related Posts

    ప్రకాశం జిల్లా కలెక్టర్ గా రాజాబాబు

    ప్రకాశం జిల్లా కలెక్టర్ గా రాజాబాబు నియమితులయ్యారు. బాపట్ల కలెక్టర్ గా పనిచేస్తున్న ఆయనను ప్రకాశంకు బదిలీ చేశారు.  ప్రకాశం కలెక్టర్ గా పనిచేస్తున్న తమీమ్ అన్సారియాను గుంటూరు జిల్లాకు బదిలీ చేశారు. వీరితో పాటు మొత్తం 12 మంది జిల్లా…

    ఒంగోలు చిన్నారికి భగీరధ ఆర్ట్ ఫౌండేషన్ బంగారుపతకం

    ఒంగోలులోని రంగుల ఆర్ట్ష్ గ్యాలరీలో శిక్షణ పొందుతున్న ఆరు సంవత్సరాల పల్లపోతు శాన్విశ్రీ వరేణ్య నేషనల్ ఆర్ట్ కాంపిటీషన్ సబ్ జూనియర్ విభాగంలో గోల్డ్ మెడల్ సాధించింది. రాజమండ్రిలోని భగీరధ ఆర్ట్ ఫౌండేషన్ నిర్వహించిన పోటీల్లో శాన్విశ్రీ వరేణ్య బంగారు పతకం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    ప్రకాశం జిల్లా కలెక్టర్ గా రాజాబాబు

    తురకపాలెంలో వరుస మరణాలపై లోతుగా పరిశోధన

    తురకపాలెంలో వరుస మరణాలపై లోతుగా పరిశోధన

    బీసీ సంక్షేమ శాఖకు స్కోచ్ అవార్డు

    ఈజ్ ఆఫ్ జస్టిస్ వ్యవస్థతోనే సత్వర న్యాయం

    ఈజ్ ఆఫ్ జస్టిస్ వ్యవస్థతోనే సత్వర న్యాయం

    గ్రామీణ విలేకరులకు పునశ్చరణ తరగతులు.

    బార్ ల లైసెన్స్ రుసుములో భారీ తగ్గింపు…

    బార్ ల లైసెన్స్ రుసుములో భారీ తగ్గింపు…